తిరుమల శ్రీవారిని నేడు హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ విరామ దర్శన సమయంలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేదపండితులు ఆయనకు రంగనాయక మండపంలో ప్రత్యేకంగా ఆశీర్వదించి శ్రీవారి చిత్రపటం బహూకరించారు.