ఇండియాపై పాకిస్తాన్ ఆర్మీ జరిపిన దాడుల్లో మాజీ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. LoC వెంబడి ఉన్న గ్రామాలపై.. విచక్షణారహితంగా పాక్ ఆర్మీ దాడులు చేసింది. పాక్ ప్రయోగించిన మోర్టార్ షెల్ ముక్కలు తగిలి.. అమన్జీత్ సింగ్ అనే మాజీ సైనికుడు మృతిచెందాడు. షెల్లింగ్ ప్రారంభమైన సమయంలో.. తన ఇంట్లోనే అమన్ నిద్రిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అమన్జీత్ మృతితో ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.