పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై ఆయన భార్య బుష్రా శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. రావల్పిండిలోని అడియాలా జైలులో తన భర్తకు కలుషిత ఆహారం ఇస్తున్నారని, అపరిశుభ్ర పరిస్థితుల్లో ఉంచారని ఆమె వాపోయింది. ఇస్లామాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడింది. ఇమ్రాన్ఖాన్పై విష ప్రయోగం జరిగే అవకాశం ఉందని పేర్కొంది. గత ఏడాది ఆగస్టులో ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. ఆయనపై 200లకు పైగా కేసులు ఉన్నాయి.