మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రజా రవాణాను మెరుగుపర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఆర్టీసీ బస్సు డిపోకు మంత్రి సీతక్క గురువారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ములుగు ప్రజలకు పొన్నం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కాగా రూ.4.5కోట్ల నిధులతో ఏటూరునాగారంలో శంకుస్థాపన చేయనున్న ఈ డిపో తెలంగాణలో 99వ ఆర్టీసీ డిపోగా నిలవనుంది.