ఝార్ఖండ్లోని రాంగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రామ్గఢ్లోని కర్మాలో అక్రమ తవ్వకాల సమయంలో బొగ్గు గని కూలి నలుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని మిగిలినవారి కోసం గాలిస్తోంది. అయితే రాష్ట్రంలో ఇటీవల అక్రమ మైనింగ్ ఎక్కువగా జరుగుతోందని, ప్రభుత్వం మౌనంగా ఉంటూ మైనింగ్ మాఫియాకు మద్దతు ఇస్తోందని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని స్థానికులు తెలుపుతున్నారు.