పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిన నలుగురు మహిళలు (వీడియో)

61చూసినవారు
తెలంగాణలో నిజామాబాద్ లో షాకింగ్ ఘటన జరిగింది. పేకాట ఆడుతూ పోలీసులకు నలుగురు మహిళలు చిక్కారు. పట్టణంలోని సరస్వతి నగర్ నీలోఫర్ ఆసుపత్రి నాలుగో అంతస్థులో డబ్బు పెట్టి పేకాట ఆడుతున్న నలుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు.
మహిళల నుంచి రూ.15 వేల నగదుతో పాటు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు పట్టుబడ్డ మహిళలంతా ప్రముఖ వైద్యుల సతీమణులని సమాచారం. ఈ ఘటనసంబంధించిన వీడీయో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్