ఏకీకృత పింఛన్ స్కీమ్ ద్వారా 25 ఏళ్లు పనిచేసే ఉద్యోగికి పూర్తి పెన్షన్ వస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. యూపీఎస్ స్కీమ్ ద్వారా 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. పదేళ్లు సర్వీస్ చేసిన వారికి రూ.10 వేల పెన్షన్ వస్తుంది. ఉద్యోగులు సర్వీసులో ఉండగా మరణిస్తే వారి భార్యలకు 60 శాతం పెన్షన్ ఇస్తారు. ఇక, ఏప్రిల్ 1, 2025 నుంచి ఈ స్కీమ్ అమల్లోకి రాబోతోంది.