TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ సినీ అవార్డుల ప్రదాన కార్యక్రమం శనివారం HYDలోని హైటెక్స్లో జరగనుంది. 2014 నుంచి 2023 వరకూ ఉత్తమ చిత్రాలకు, 2024 సంవత్సరానికి అన్ని విభాగాలకూ గద్దర్ ఫిల్మ్ అవార్డులను అందజేయనున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఉన్నతాధికారులు, సినీ ప్రముఖులు పాల్గొననున్నారు.