అచ్చంపేట నియోజకవర్గం వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్, సామాజికవేత్త కొమ్మగోని శ్రీనివాస్ గౌడ్ గురువారం ఢిల్లీలో ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి సతీమణి ప్రముఖ విద్యావేత్త, రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక సేవ, దాతృత్వం విద్యతో సహా వివిధ రంగాలలో ఆమె సేవలందించడం అభినందనీయమని అన్నారు.