గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గట్టు మండల పరిధిలోని చాగదోన గ్రామానికి చెందిన గుంజపల్లి మునిస్వామి విద్యుత్ షాక్ తో మరణించారు. భార్య గుంజపల్లి సరోజకు ప్రభుత్వం తరపున ఆర్థికసహాయం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి శుక్రవారం విద్యుత్ ప్రమాద బీమా రూ.5 లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్ కుమార్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.