జోగులాంబ గద్వాల జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో ప్రతిపాదనలకు అనుగుణంగా పనులు నాణ్యతతో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. శనివారం పట్టణంలోని గంజిపేట ప్రాథమిక పాఠశాల, మోహిన్ ముల్లా ఉన్నత పాఠశాలల్లో చేపట్టిన పనులు పరిశీలించారు. మోహిన్ ముల్లా పాఠశాలలో ఇప్పటికే టాయిలెట్స్ ఉండగా కొత్తగా నిర్మించడం ఎందుకని ప్రశ్నించారు. ఇతర పనులకు ఎందుకు ప్రతిపాదనలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.