పెండింగులో ఉన్న బిల్లులను మంజూరు చేయాలని శుక్రవారం సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదులో నిర్వహించ తలపెట్టిన ధర్నాకు తరలి వెళ్లకుండా ఉండవల్లి ఎస్ఐ శ్రీనివాసులు ముందస్తు అరెస్టులు నిర్వహించారు. ఉండవల్లి మండలంలో పోలీసులు నేరుగా సర్పంచుల ఇళ్లకు వెళ్లి వారిని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. ఠాణా వద్ద సర్పంచుల సంఘం నాయకులు బిల్లులను వెంటనే మంజూరు చేయాలని నినాదాలు చేశారు.