దొంగతనం చేసిన బంగారును అమ్ముకోవాలని ప్రయత్నిస్తుండగా దొంగలను జిల్లా కేంద్రంలో 2టౌన్ పోలీసులు పట్టుకున్నారు. సీఐ ఇజాజ్ అహ్మద్ వివరాలు. బోయపల్లికి చెందిన మండ్ల మాసయ్య ఆదివారం స్థానిక మోతీనగర్ లో పాత ఇనుప సామాన్లు ఏరుకోవడానికి వెళ్లి తాళం వేసిన ఇంటిపై కన్నేశాడు. బుధవారం మాసయ్య స్నేహితురాలు మండ్ల లక్ష్మీ కలిసి ఆభరణాలను అమ్ముకోవడానికి తిరుగుతుండగా పట్టుకొని 123గ్రా. బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.