జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సందీప్ గౌడ్ నీటితో నడిచే జేసీబీ యంత్రాన్ని తయారు చేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గురువారం ఉపాధ్యాయులు మాట్లాడుతూ సందీప్ గౌడు చిన్న వయసులోనే నీటితో నడిచే యంత్రాన్ని తయారు చేయడం గొప్ప విషయం అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.