ఈనెల 3, 4 తేదీలలో నాగర్ కర్నూల్ లో జరిగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల ఏఐటియుసి కార్మిక సంఘాల శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కొండన్న శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. శిక్షణా తరగతులకు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్, ఇతర నాయకులు పాల్గొంటారని అన్నారు. శిక్షణ తరగతులకు కార్మికుల, యునియన్ నాయకులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.