ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చే పూర్తి బాధ్యత డ్రైవర్లపై ఉంటుందని డిటిఓ మేఘ గాంధీ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు కార్యక్రమంలో భాగంగా శనివారం నారాయణపేట ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రోడ్డు భద్రత నియమాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. సెల్ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ లావణ్య అధికారులు పాల్గొన్నారు.