కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కార్పొరేట్ల సంపద పెంచే విధంగా వుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్ అన్నారు. బుధవారం దామరగిద్ద మండల కేంద్రంలో బడ్జెట్ కు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉపాధిహామీ పథకానికి నిధుల్లో కోత విధించారని, వ్యవసాయ కార్మికులకు ఎలాంటి కేటాయింపులు జరపలేదని విమర్శించారు. నాయకులు పాల్గొన్నారు.