జిల్లాలో నేటి నుంచి ఆగస్టు 30 వరకు 30, 30ఏ పోలీస్ యాక్ట్ అమలులో వుంటుందని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయ పార్టీలు, ప్రజా, యువజన, కుల సంఘాలు ముందస్తు అనుమతులు లేకుండా ఎలాంటి సభలు, నిరసన కార్యక్రమాలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకో వంటి కార్యక్రమాలు చేపట్టరాదని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.