నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం తెల్ల కందులు క్వింటాకు గరిష్టంగా రూ. 8, 960, కనిష్టంగా రూ. 7, 500 ధర పలికిందని మార్కెట్ కార్యదర్శి భారతి తెలిపారు. సన్న రకం వరి గరిష్టంగా క్వింటాకు రూ. 2, 493, కనిష్టంగా రూ. 1, 800, ఎర్ర కందులు గరిష్టంగా రూ. 8, 650 కనిష్టంగా రూ. 6, 029, అలసందలు క్వింటాకు రూ. 7, 512 ధర పలికిందని ఆమె చెప్పారు.