వనపర్తి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయం వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వర్ణిక అనే బాలిక మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వనపర్తి రూరల్ ఎస్ఐ జలేంధర్ రెడ్డి వివరాల ప్రకారం. వనపర్తికి చెందిన బాలిక కారులో కుటుంబ సభ్యులతో అయ్యప్ప ఆలయం వద్దకు చేరుకున్నారు. కారును ఆలయం వైపు మలుపుతుండగా వనపర్తి నుంచి రాజనగరం వైపు వెళుతున్న మరో కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న వర్ణిక మృతి చెందింది.