ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) మూడో త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ 8.4 శాతం వృద్ధి నమోదు చేసింది. తయారీ, మైనింగ్, నిర్మాణరంగాలు పుంజుకోవడంతో ఇది సాధ్యమైంది. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం (NSO) గురువారం సంబంధిత గణాంకాలను వెల్లడించింది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో అంచనాలను గణాంక కార్యాలయం వెలువరించింది.