మంత్రి శ్రీధర్ బాబుతో గురువారం జర్మనీ మంత్రి డానియెల్ బృందం భేటీ అయింది. ఈ మేరకు తెలంగాణలో పెట్టుబడులపై రసాయన, ఫార్మా, ప్యాకేజింగ్, ఆటోమొబైల్, లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులపై శ్రీధర్బాబుతో డానియెల్ చర్చించారు. ఆవిష్కరణలు, పరిశోధన, తయారీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని శ్రీధర్బాబు తెలిపారు. రైన్ల్యాండ్, తెలంగాణ మధ్య పెట్టుబడులకు ఇరుపక్షాలు అంగీకారం తెలిపారు.