ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భాగంగా ఆదివారం భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. మ.2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. వరుస విజయాలతో జోరు మీదున్న రోహిత్ సేన ఈ మ్యాచ్లో గెలిచి తన సత్తా చూపించాలని అనుకుంటోంది. ప్లేయర్లంతా ఫుల్ ఫామ్లో ఉన్నారు. ఒకే వేదికలో మ్యాచ్ ఆడటం ఇండియాకు కలిసొచ్చే అంశం. అయితే ఐసీసీ ఈవెంట్లలో భారత్పై న్యూజిలాండ్దే పైచేయి కావడం కలవరపెడుతోంది. టీమిండియా గెలవాలని కోరుకుందాం.