ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతుండగా మొబైల్ పేలి బాలిక మృతి చెందింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చోటు చేసుకుంది. ఊర్వశి అనే బాలిక తన అమ్మమ్మ ఇంటికి వేసవి సెలవులకు వచ్చింది. ఛార్జింగ్ పెట్టిన ఫోన్ మాట్లాడుతుండగా పేలడంతో ఆమె చెవి, ముఖం, దవడపై తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు.