ఉత్తరప్రదేశ్లోని ఎటాహ్లో తాజాగా దారుణ ఘటన జరిగింది. ప్రియురాలు పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో తన తండ్రిని ఓ యువకుడు గొంతు కోసి హత్య చేశాడు. మృతుడు ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో హత్య చేసినట్లు తెలుస్తోంది. ప్రియురాలి పెళ్లి శుక్రవారం జరగాల్సి ఉంది. ఘటనకు పాల్పడిన అనంతరం నిందితుడు పరారీలో ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.