అస్సాంలోని సిల్చార్లో పదో తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు. అయితే పార్టీ అనంతరం క్లాస్ రూంలోకి వెళ్లిన విద్యార్థులు రచ్చ రచ్చ చేశారు. ఫర్నిచర్, ఫ్యాన్లు, బల్బులు, బ్లాక్ బోర్డులు, ఇతర సామగ్రి ధ్వంసం చేశారు. అమ్మాయిలు సైతం అబ్బాయిలతో కలిసి విధ్వంసం సృష్టించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.