డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. నిర్మలా నివాసంలో కాంగ్రెస్ ఎంపీలు, అధికారులతో పాటు భట్టి విక్రమార్క కలిశారు. విభజన చట్టం ప్రకారం AP నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని.. వాటిని వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.