బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.850 పెరిగి రూ.63,600కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.930 పెరిగి రూ.69,380 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.600 పెరగడంతో రూ.81,600కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.