దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు శుక్రవారంతో పోలిస్తే.. శనివారం మళ్లీ పెరిగాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 250 పెరిగి.. రూ. 87,700కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 270 పెరగడంతో.. రూ. 95,670కి చేరుకుంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ. 2,000 పెరిగి.. రూ.1,10,000 వద్ద కొనసాగుతోంది.