తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టీమిండియా మహిళా క్రికెటర్ గొంగడి త్రిష మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో కలుసుకొని మాట్లాడారు. అండర్-19 మహిళల వరల్డ్ కప్లో తెలంగాణకు చెందిన గొంగడి త్రిష అద్భుతంగా రాణించడంతో భారత్ వరల్డ్ కప్ గెలిచింది. ఈ క్రమంలో త్రిషను సీఎం రేవంత్ అభినందించారు.