తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు గుడ్న్యూస్ చెప్పనుంది. వారి కోసం 'వర్కర్ టూ ఓనర్' పేరుతో ఒక కొత్త పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఇటీవల సమావేశమై ఈ పథకం అమలుపై చర్చించారు. ఇందులో భాగంగా గతంలో నిర్మించిన వీవింగ్ రూములలో పవర్ లూమ్స్ ను ఏర్పాటు చేసి అర్హులైన చేనేత కార్మికులకు అందజేయాలని నిర్ణయించారు. ఎన్నికల కోడ్ ముగిశాక దీనిపై స్పష్టత రానుంది.