ఐపీఎల్ 2025 మే 17 నుంచి పునఃప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. భారత్-పాక్ ఉద్రిక్తతల కారణంగా కొంతమంది విదేశీ ప్లేయర్లు స్వదేశానికి వెళ్లిపోయారు. ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణగడంతో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వెస్టిండీస్ భీకర హిట్టర్ రొమారియో షెపర్డ్ భారత్కు వస్తున్నాడు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 14 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.