ఏటా శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి కొన్ని లక్షల మంది వస్తుంటారు. ఈ నేపథ్యంలో అయ్యప్ప భక్తులకు కేంద్రం శుభవార్త చెప్పింది. శబరిమల సమీపంలో కొట్టాయం దగ్గర గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆమోదం తెలిపింనందుకు పీఎం మోదీకి ధన్యవాదాలు తెలిపారు.