తెలంగాణ మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్ వినిపించింది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇప్పటికే రకరకాల పథకాలు అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. మైనార్టీల్లోని అర్హులైన మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 21 నుంచి 55 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న మహిళలను ప్రభుత్వం అర్హులుగా ప్రకటించనుంది.