ఏపీ ప్రభుత్వం మత్స్యకారులకు శుభవార్త చెప్పింది. చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.10,000 నుంచి రూ.20,000కు పెంచినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. ఈ సాయాన్ని ఏప్రిల్ 26న సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేస్తారు. ఈ నిర్ణయం మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడంలో కీలకమని, గత ప్రభుత్వంలో ఈ సాయం కేవలం రూ.10,000గానే ఉండేదని మంత్రి వెల్లడించారు.