ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది: సీఎం

79చూసినవారు
ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది: సీఎం
ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు X(ట్విటర్‌)లో సీఎం ట్వీట్‌ చేశారు. అధికారులు, వ్యాపారులు రైతులను మోసం చేస్తే సహించమని తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జనగామ కలెక్టర్‌ రోహిత్‌సింగ్‌ను సీఎం అభినందించారు. రైతులను మోసం చేసిన వారిపై కేసులు పెట్టించడం అభినందనీయమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్