ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు X(ట్విటర్)లో సీఎం ట్వీట్ చేశారు. అధికారులు, వ్యాపారులు రైతులను మోసం చేస్తే సహించమని తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జనగామ కలెక్టర్ రోహిత్సింగ్ను సీఎం అభినందించారు. రైతులను మోసం చేసిన వారిపై కేసులు పెట్టించడం అభినందనీయమన్నారు.