తెలంగాణలో గ్రూపు-2,3 పరీక్షలు వాయిదా వేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖండించింది. షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఈ పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. ఈ పరీక్షలు వాయిదా అంటూ సోషల్ మీడియాల వచ్చిన ప్రచారాన్ని నమ్మవద్దని అభ్యర్థులను కోరింది.