తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే గ్రూప్స్ నియామకాలు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. గ్రూప్-1 నియామకాలు అడ్డుకోవడం వెనుక ఉన్న రాజకీయ నాయకులు ఎవరో ప్రజలకు తెలుసని సీఎం అన్నారు. హైదరాబాద్ జలసౌధ ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన కొలువుల పండుగ కార్యక్రమంలో నీటిపారుదల శాఖలో ఏఈ, జేటీవో పోస్టులకు ఎంపికైన వారికి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు.