జిమ్ ఓనర్‌ను తుపాకీతో కాల్చి చంపేశారు (వీడియో)

81చూసినవారు
దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో గురువారం రాత్రి దారుణం జరిగింది. నాదిర్ షా (35) అనే వ్యక్తికి జిమ్ ఉంది. తన స్నేహితుడితో మాట్లాడుతుండగా నాదిర్ షాపై దుండగుడు అకస్మాత్తుగా కాల్పులు జరిపాడు. కుప్పకూలిన నాదిర్ షాను అతడి స్నేహితుడు ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ హత్యకు తానే బాధ్యుడనని గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా సోషల్ మీడియాలో ప్రకటించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్