హన్మకొండ జిల్లా వంగపహాడ్ గ్రామంలో నీళ్ళు లేక చేతికొచ్చిన పంట చివరికి పశువుల మేతగా మారింది. కష్టపడి సాగు చేసి పండించిన పంట నీళ్ళు లేక పశువులకి మేతగా మారడంతో అన్నదాతల ఆవేదనకు అవధులు లేకుండా పోయింది. భూగర్భజలాలు ఇంకిపోయి బోరుబావుల్లో నీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నాయి. పాలకులు పంటలకు సరిపడా నీళ్ళు అందించి ఉండుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.