తెలుగు తేజం, స్టార్ షట్లర్ పీవీ సింధు పుట్టిన రోజు ఇవాళ. ఆమె పి.వి రమణ, విజయ దంపతులకు 1995 జూలై 5న HYDలో జన్మించింది. ఆమె ఎనిమిదేళ్ల వయస్సులో బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించింది. పుల్లెల గోపీచంద్ శిక్షణలో ఎదిగింది. వరల్డ్ ఛాంపియన్ షిప్, రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన మొదటి భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది. పద్మభూషణ్, పద్మశ్రీ, అర్జున, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులను అందుకుంది. గతేడాది వెంకట దత్త సాయిని పెళ్లి చేసుకుంది.