మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పార్టీ విస్తరణలో భాగంగా పలు కీలక మార్పులు చేసింది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా హర్షవర్ధన్ సప్కల్ ను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.