యూపీలోని ముజఫర్నగర్కు చెందిన మాలిక్ (65) తన తల్లి జగ్బీర్దేవి (92)ని ఎడ్ల బండిపై కూర్చోబెట్టి లాగుతూ కుంభమేళాకు తీసుకెళ్తున్నారు. ప్రతి రోజూ 50KMS చొప్పున 13 రోజుల్లో త్రివేణి సంగమానికి చేరుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నారు. తన తల్లిని మహా కుంభమేళాకు తీసుకెళ్లేందుకు మాలిక్ చేసిన సాహసానికి నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.