AP: జవాన్ మురళీ నాయక్ పాక్ దాడుల్లో వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. అయితే తన మేనమామ మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కరోజైనా ఆర్మీ డ్రెస్ వేసుకొని చనిపోతా అని మురళి నాయక్ పదే పదే చెప్పేవాడని, వాళ్ల పేరెంట్స్ ఎంత వద్దనా ఆర్మీలోనే చేరుతానని పట్టుబట్టి ఆర్మీలో చేరాడంటూ చెప్పారు. చిన్నప్పటి నుంచే మురళి నాయక్కి దేశభక్తి చాలా ఎక్కువని, బాధగా ఉన్నా దేశం కోసం వీరమరణం పొందినందుకు అతని కుటుంబ సభ్యులుగా మేమంతా చాలా గర్వపడుతున్నామని పేర్కొన్నారు.