ఢిల్లీలోని గూర్గామ్లో భార్యపై కోపంతో మరదలిని హత్య చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. మొహిత్ అనే వ్యక్తి భార్య ఇంటి నుండి చెప్పకుండా వెళ్లిపోవడం, ఆమె తల్లిదండ్రులు స్పందించకపోవడంతో కోపోద్రిక్తుడై తన భార్య చెల్లెలిని హత్య చేశాడు. మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి మురుగుకాల్వలో పడేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.