వెస్టిండీస్ హిట్టర్ ఆండ్రీ రస్సెల్ బీభత్సం సృష్టించారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న 3వ టీ20 మ్యాచ్లో ఆసీస్ బౌలర్లను ఊచకోత కోశారు. కేవలం 29 బంతుల్లో 7 సిక్సులు, 4 ఫోర్లతో 71 రన్స్ కొట్టాడు. 79/5 తో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన రస్సెల్ ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడి చేశారు. దీంతో 20 ఓవర్లలో విండీస్ 220/6 స్కోర్ చేసింది. కాగా 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో ఆసీస్ రెండు మ్యాచ్లు గెలిచి ముందంజలో ఉంది.