ఆ సీటులో కూర్చోవడం వల్లే ప్రాణాలతో బయటపడ్డాడు!

80చూసినవారు
ఆ సీటులో కూర్చోవడం వల్లే ప్రాణాలతో బయటపడ్డాడు!
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో విశ్వాస్ కుమార్ రమేశ్‌ (40) మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. విమానంలో 11A సీటులో కూర్చున్న విశ్వాస్, ప్రమాదం జరిగిన క్షణాల్లోనే తన ముందున్న ఎమర్జెన్సీ డోర్‌ ద్వారా బయటకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. సాధారణంగా 11A సీటుకు కిటికీ ఉండదు కాబట్టి.. ప్రయాణికులు ఆ సీటును ఎంచుకోవడానికి ఆసక్తి చూపరు. కానీ అదే సీటు విశ్వాస్‌కు ప్రాణ భిక్ష పెట్టింది.

సంబంధిత పోస్ట్