తమిళనాడులోని కన్యాకుమారిలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. బస్సు ఢీకొట్టినా ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఒకతను రోడ్డును దాటుతుండగా దూసుకొచ్చిన బస్సు ఢీకొట్టింది. దీంతో అతను గాల్లోకి ఎగిరిపడ్డాడు. అయితే అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడడంతో చూసిన వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.