గ్రూప్-1 అంశంపై హైకోర్టులో విచారణ వాయిదా

51చూసినవారు
గ్రూప్-1 అంశంపై హైకోర్టులో విచారణ వాయిదా
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు సమయం కావాలని TGPSC, ఇతర న్యాయవాదులు కోరడంతో విచారణను న్యాయస్థానం ఈ నెల 30కి వాయిదా వేసింది. ఎగ్జామ్ సెంటర్ల కేటాయింపు, వాల్యుయేషన్లో అక్రమాలు జరిగాయని పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా నియామకాలపై స్టే విధించిన సంగతి తెలిసిందే. ఆ స్టేను ఎత్తివేయాలంటూ ఎంపికైన అభ్యర్థులు పిటిషన్లు వేయగా నేడు వాదనలు జరిగాయి.

సంబంధిత పోస్ట్