వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు గురువారానికి వాయిదా వేసింది. బుధవారం విచారణ చేపట్టిన సీజేఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పురావస్తు, చారిత్రక ఆస్తులను వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించలేమని పేర్కొంది. అలాగే తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.